రుద్రూర్, బతుకమ్మ :బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం హిందూ సంఘాలు ఇచ్చిన బంద్ రుద్రూర్ మండల కేంద్రంలో విజయవంతమైంది. మంగళవారం ఉదయం నుంచి దుకాణాలు, వ్యాపార సముదాయాలు, పెట్రోల్ బంకులు, పాఠశాలలు స్వచ్ఛందంగా మూసి ఉంచారు. హిందువులపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రుద్రూరు తహశీల్దార్ వెంకటేష్ కు వినతిపత్రాన్ని అందజేశారు. వినతిపత్రాన్ని అందించిన వారిలో హిందూ సంఘాల నాయకులు, భజరంగ్ దళ్ నాయకులు తదితరులు ఉన్నారు.