పేకాట స్థావరం పై పోలీసుల మెరుపు దాడి

2,680
  • కార్పొరేట్ లెవెల్ లో సిట్టింగ్
  • కరెన్సీ లెస్ కాయిన్స్ తో గేమ్
  • కరీంనగర్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లా జూదరుల అడ్డా

బతుకమ్మ, నిజామాబాద్ ప్రతినిధి – కమ్మర్ పల్లి మండల కేంద్రం నడిబొడ్డున 44 హైవేకు అనుకోని భవనంలో కార్పొరేట్ క్లబ్ మాడల్ ల్లో నడుపుతున్న పేకాట స్థావరం పై పోలీసులు మెరుపు దాడి చేశారు.ఈ దాడిలో కమ్మర్ పల్లికి ఇటీవలే బదిలీ పై వచ్చిన ఎస్సైకి కండ్లు భైర్లు కమ్మే నిజలు బైట బడ్డాయి. గత ఏడాదిన్నార కాలంగా ఏదేచ్చగా నడుస్తున్న ఈ క్లబ్ గురించి మండల కేంద్రం ప్రజలేవ్వరికి ఇప్పటికీ పత్త లేకుండా పక్కడబందిగా నిర్వాహకులు నడుపుతున్నారు.ఈ పద్మవ్యూహం ఎవరు నడుపుతున్నారో ఆ నిర్వాహకులు ఎవరో ఇంకా పోలీసులకు తెలల్సిఉంది. ఈ దాడి జరిగినట్లు మండల కేంద్రంలో తెలియగానే చాలా మంది ఆశ్చర్యపోయారంటే అతిశయోక్తి కాదు. ఈ క్లబ్ లో పేకాట నడుస్తుందని తెల్సుకొన్న ఎస్సై తన సిబ్బందితో రాత్రి దాడి చేశారు. ఈ దాడిలో కరీంనగర్, జగిత్యాల జిల్లాలలోని వివిధ గ్రామాలనుండి, నిజామాబాద్ జిల్లాలోని బాన్స్ వాడ, బోధన్ ఇతర ప్రాంతాలకు చెందిన పేకాట కీలడీలు నోట్లు ఇచ్చి కాయిన్స్ తీసుకొని పేకాట ఆడుతున్నారు. ఈ క్లబ్ లో దాడి చేసి 35 మంది ఆటగాళ్ళను పోలీసు ఆడుపులోకి తీసుకొన్నారు. నగదు రూ. 2,38200, 35 సెల్ ఫోండ్లు, కాయిన్స్ ను స్వాధీనం చేసుకొన్నారు. నాలుగు కార్లు, ఒక బైక్ ను స్వాదీనం చేసుకొని సీజ్ చేశారు. కేసు నమోదు చేసి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకొన్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.అసలు నిర్వాహకులు ఎవరో ఇంకా తెలాల్సి ఉందని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.