ఎవరు ఈ దారిన వెళ్లకూడదు

1,051

బతుకమ్మ,మోర్తాడ్ : మోర్తాడ్ మండలంలోని ధర్మోరా, పాలెం గ్రామాల మధ్య ఉన్న చెక్ డ్యాం పై వరద నీరు పొంగిపొర్లుతూ ప్రవాహం ఎక్కువ రావడంతో ఎవరు ఆ రోడ్డుపైన వెళ్ళకూడదు అని ఎస్సై విక్రమ్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆ ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు ఇబ్బంది జరిగి ప్రమాదాలు జరుగుతున్నాయని ఎవరు ఆ దారిన వెళ్లకూడదని ఆయన పేర్కొన్నారు. ఉదయం ట్రాలీ ఆటో ఇరుక్కు పోవడంతో స్థానికులు జే సీ బీ సహాయంతో సురక్షితంగా బయటికి తేవడంతో గ్రామస్తులను ఎస్సై అభినందించారు. ఆయన వెంట స్థానికులు సృజన్ తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.