బతుకమ్మ,మోర్తాడ్ : మోర్తాడ్ మండలంలోని శేట్ పల్లీ గ్రామంలో పిడుగు పడి వల్ల ఊర చెరువు దగ్గర ఉన్న విద్యుత్ నియంత్రికం పాడైపోయిందని విద్యుత్ శాఖ ఏఈ సురేష్ తెలిపారు. దీంతో విద్యుత్ శాఖ సిబ్బంది గ్రామ అభివృద్ధి కమిటీని సంప్రదించారు. గ్రామాభివృద్ధి కమిటీ చొరవ తీసుకొని కొత్తది ఏర్పాటు చేయడం జరిగింది. కార్యక్రమంలో లైన్మెన్ రాజేందర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.