బోధన్ కౌన్సిలర్ పై పోక్సో కేసు

228

బతుకమ్మ న్యూస్, బోదన్ 
నిజామాబాద్ జిల్లాలో ఒక ప్రజా ప్రతినిధిపై పోక్సో కేసు నమోదు కావడం కలకలం రేపుతోంది. బోదన్ మున్సిపల్ కౌన్సిలర్ పై ఎడపల్లి పోలిస్ స్టేషన్ లో పోక్సో కేసు నమోదు ఐనా విషయం మంగళవారం అలస్యంగా వెలుగు చూసింది. బోదన్ పట్టణానికి చెందిన ఒక కౌన్సిలర్ తన వార్డుకు చెందిన మైనర్ బాలికతో కారులో అనుమానాస్పద స్థితిలో ఉండగా మంగల్ పాడ్ అనే గ్రామం ప్రాంతంలో స్థానిక యువకులు పట్టుకున్నారు. అక్కడ సదరు మైనర్ తనపై కౌన్సిలర్ అఘాయిత్యానికి యత్నించాడని తెలుపడంతో వారు అతడిని చితక బాది పోలిసులకు  అప్పగించారు. ఈ మేరకు పోలిస్ లు కేసు నమోదు చేశారు. బిఆర్ఎస్ నుంచి కౌన్సిలర్ గా గెలిచినప్పటికి గతేడాది తన సోదరుడికి అత్యచారం కేసులో సహకరించాడని అనాడు పార్టీ ప్లోర్ లీడర్ పదవి నుంచి తప్పించి పార్టీ నుంచి ఉద్వాసన పలికారు. ఏడాది వ్యవదిలోనే ఇద్ధరు సోదరులు అఘాయిత్యాల కేసులో చిక్కడం కలకలం రేపింది.

Leave A Reply

Your email address will not be published.