బతుకమ్మ: బిచ్కుంద : ఢిల్లీ మద్యం కేసులో అరెస్ట్ అయిన టిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసిన నేపథ్యంలో జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంతుషిండే హర్షం వ్యక్తం చేశారు. కవిత బెయిల్ పిటిషన్ పై జస్టిస్ బీ ఆర్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత ఈడి తరఫున లాయర్లు తమ వాదనలు వినిపించారు బెయిల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో జుక్కల్ మాజీ శాసనసభ సభ్యులుహన్మంతుషిండే స్పందిస్తూ బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. న్యాయమే గెలిచిందంటూ ఆయన వ్యాఖ్యానించారు.