జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ :
ఉపాధ్యాయుల సమస్యలపై వారి పక్షాన పోరాడేది పి ఆర్ టి యు తెలంగాణ మాత్రమే దాని నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి తోని అది సాధ్యమని టిపిఆర్టియు జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ అన్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా సంఘ భవనం లో సమావేశం జిల్లా అధ్యక్షులు కృపాల్ సింగ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా
అధ్యక్షులు కృపాల్ సింగ్ మాట్లాడుతూ సాంకేతిక కారణాల వల్ల పదోన్నతులు బదిలీలలో జరిగిన పొరపాట్లను పరిష్కరించాలని, బదిలీ అయ్యి రిలీవ్ కానీ ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని కోరారు. రాష్ట్రం లోని అన్ని ప్రాథమిక పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ సమాన స్థాయి ప్రైమరీ స్కూల్ హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని జీవో. 317 అప్పీల్స్ పరిష్కరించాలని, రాష్ట్రం లో వివిధ కారణాలతో ఈ నెల ఒకటో తేదీ నాటికీ ఖాళీగా ఉన్న గజటెడ్ ప్రధానోపాధ్యాయ పోస్టులను అర్హులైన స్కూల్ అసిస్టెంట్ లతో పదోన్నతి కల్పించి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. 30% తగ్గకుండా పిఆర్సి ఇవ్వాలని, ఆర్థిక శాఖ వద్ద ఉన్న పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరడం జరిగింది. ప్రధాన కార్యదర్శి కనకపురం రవీందర్ మాట్లాడుతూ డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 57/4,57/5 ఉత్తర్వుల ప్రకారం పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచెయ్యాలి దీని వలన ప్రభుత్వానికి తక్షణం దాదాపు 2వేల కోట్లు లాభం జరుగుతుంది అని, అదేవిధంగా సిపిఎస్ రద్దు చేయాలి, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు బదిలీ లు పూర్తి చేసి వారికి 010 కింద జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.ఉమ్మడి సర్వీస్ రూల్స్ త్వరగా సాధించాలని, స్కూల్ అసిస్టెంట్ లకు జూనియర్ లెక్చరర్ పదోన్నతులు కల్పించాలని, కేజీబీవీ, నాన్ టీచింగ్ సిబ్బంది కి మినిమం టైం స్కేల్ ప్రకటించాలని కోరారు. 30 సంవత్సరాలనుండి నిలిచిపోయిన పండిత్ పీఈటీ ల అప్గ్రేడేషన్ అన్ని విభాగలలో పదోన్నతులు బదిలీలుకల్పించడం,చాలా రోజులనుండి పెండింగ్ లో ఉన్న ఎంఈఓ బదిలీలు జరిపినందుకు, ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్ ప్రకటించినందుకు అన్ని పాఠశాలలకు స్కావెంజర్ లను ఇచ్చినందుకు ప్రభుత్వానికి, ముఖ్య పాత్ర వహించిన గాల్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో నాయకులు వాసుదేవరావు ,నల్లోల్ల గంగాధర్ , జావీద్ , భూషణ్ , సత్యనారాయణ గారు ప్రభాకర్ పాల్గొన్నారు.