కోర్టు కేసుల పేరిట జిల్లా పరిషత్ కు డిప్యూటేషన్

3,695
  • పక్కా ప్రణాళికతో ఒకరికి నెల.. మరొకరికి రెండు నెలలు
  • సైలెంట్ గా పాగా వేసేందుకేనా..?

బతుకమ్మ, నిజామాబాద్ : వడ్డించేది మనోడు అయితే బంతిలో ఏ మూల కూర్చున్న అందుతుందనే సామెతను జిల్లా పరిషత్ వ్యవహారాలు నిజం చేస్తున్నాయి. బదిలీపై వెళ్లిన ఇద్దరినీ యథాస్థానానికి డిప్యూటేషన్ పై తెచ్చేందుకు చాలా ఎత్తుగడలు వేశారు. ఈ విషయం కాస్త రూరల్ ఎమ్మెల్యేకు చేరడంతో తన నియోజకవర్గంలో ఉన్న ఉద్యోగులకు డిప్యూటేషన్ వేయకూడదని, వారిని వెనక్కి పంపాలని కోరారు. అసలు వచ్చేలా ఉందని పసిగట్టిన ఒక గ్రూప్ (విభాగం) ఉద్యోగులు ఎత్తులకు పై ఎత్తులు వేశారు. ఆలోచన వచ్చింది తడవుగా సీఈవో చెంతకు చేరి కోర్టు కేసులపై పలుమార్లు తిరగాల్సి ఉంటుందని చెప్పి డిప్యూటేషన్ తెచ్చుకోవడంలో సఫలీకృతమయ్యారు. మిగతా వారికి పని తెలియదన్నట్లు ఈ చర్యకు పాల్పడడంతో పరిషత్ ఉద్యోగులు అవమానభారంతో రగిలిపోతున్నారు.
పక్కా ప్రణాళికతో..
ఆ ఇద్దరినీ జెడ్పి కి తీసుకురావడానికి ఒక గ్రూపులో పెత్తనం చేసేవారు ఎన్నో ప్రయత్నాలు చేశారు. ముందుగా డిప్యూటేషన్ పై వచ్చి పాతుకు పోతే మెడబట్టి గెంటిన బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుందని భావించారు. ఇది అందరికీ తెలిసిందేనని ఏళ్లుగా జడ్పీ లోనే ఉంటూ అధికారులకు మాయమాటలు చెప్పి కాలం వెళ్లదీసుకునేవారు వ్యూహరచన చేశారు. మున్ముందు అడ్డు ఎవరూ రారు అనే ధీమాలో ఉన్న ఆ గ్రూప్ వాళ్ళు ప్రక్క ప్రణాళికతో సీనియర్ అసిస్టెంట్కు ఒక నెల.. పర్యవేక్షకునికి రెండు నెలలు గడువు అన్నట్లుగా జిల్లా పరిషత్ ప్రత్యేక అధికారితో ఉత్తర్వులు తీయించారు. ఆ కాల పరిమితిలో జిల్లా పరిషత్ కు డిప్యూటేషన్ పై రావాలని ఈనెల 16న సీఈఓ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఆ ఇద్దరిని వెంటనే పంపించాలని ఆయా మండల పరిషత్ అధికారులను సైతం సీఈవో జారీ చేసిన ఉత్తర్వులు ఆదేశాలు ఉన్నాయని తెలిసింది.
పాగా వేసేందుకేనా..?
కోర్టు కేసుల పేరిట జెడ్పి కి వచ్చిన ఆ ఇద్దరు పాగా వేసేందుకే వచ్చారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఏళ్ల తరబడిగా పరిష్కారం కానీ కేసులో రెండు నెలల్లో పూర్తవుతాయా అనే సందేహాలు సర్వత్ర చర్చ జరుగుతుంది. దీనిని అడ్డం పెట్టుకొని ఇక్కడ స్థిరపడేందుకే నెలల గడువుతో పని చేసేందుకు డిప్యూటేషన్ పై వచ్చి విధుల్లో చేరారు.
ఎన్నికల కోడ్ వస్తే..
స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనను ప్రభుత్వం త్వరలోనే వెలువరించనున్నది. ఈ ఎన్నికలను సాకుగా చూపించి ప్రస్తుతం బదిలీ చేయరాదని అధికారులతో చెప్పించుకోవడానికి సైతం వెనుకాడరనే మాటలు వినిపిస్తున్నాయి. కోడ్ ఉన్నందున రారాదు పోరాదు అనే నేపంతో మళ్లీ డిప్యూటేషన్ను పొడిగించుకునే అవకాశం వారికి లేకపోలేదు.
అవమానభారంలో ఉద్యోగులు..
ప్రతి విషయంపై చాలా పరిజ్ఞానం ఉండి పరిపక్వత ఉన్న పర్యవేక్షకులు, సీనియర్ అసిస్టెంట్లు చాలామంది ఉన్నారు. వారిని కాదని బదిలీపై వెళ్లిన వారిని మళ్లీ జిల్లా పరిషత్ కు కోర్టు కేసుల పేరిట తీసుకురావడంపై ఉద్యోగులు అవమాన భారంతో కుమిలిపోతున్నట్లు తెలుస్తోంది. సాధారణ పర్యవేక్షకుని స్థానంలో ఉన్నవారు ఎవరికైనా సరే కోర్టుల కోసం తిరగాల్సి ఉంటుంది. రెగ్యులర్ అధికారి వచ్చిన ఆస్థానాన్ని ఇవ్వదలుచుకో లేనప్పుడు అందులోనే ఉన్న మరో విభాగపు పర్యవేక్షకునికి ఇన్చార్జిగా బాధ్యతలు అప్పజెప్పారు. సాధారణ పర్యవేక్షకుని స్థానంలో ఎవరున్నా గాని సంస్థ తరఫున పనిచేయాల్సి ఉంటుంది. బదిలీపై వెళ్లిన వారే పనిమంతులు.. మిగతా వాళ్ళు కాదని భ్రమను జిల్లా పరిషత్ లో కల్పించారు. కోర్టు కేసులకు సీఈవో కు సంబంధం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న అధికారి కేసులకు హాజరవుతున్నారు. తనతో కాదని బదిలీపై వెళ్లిన అధికారిని కొన్ని నెలలు డిప్యూటేషన్ పై వచ్చి కోర్టు కేసులను చూడాలని పిలుస్తా అయిపోతుంది అనే వాదనలు జిల్లా పరిషత్ లోని మెజారిటీ ఉద్యోగుల నుంచి వినబడుతున్నాయి. ఏది ఏమైనా బదిలీపై వెళ్లిన జడ్పీ అధికారి కాకుండా సాధారణ పర్యవేక్ష కొన్ని డిప్యూటేషన్ పై తీసుకురావడం చూస్తే అంతర్గతంగా వర్గ విభేదాలు పొడచూపుతున్నాయని అనుమానాలను జడ్పీ ఉద్యోగులు వెల్లడిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.