బతుకమ్మ నిజమాబాద్ సిటీ : గణపతి ఉత్సవాల సందర్భంగా డిటు సెక్షన్ టౌన్ లో మహా అన్నదాన ప్రసాదం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ మండలి నిర్వాహకులు వినాయకునికి పూజ, అర్చన కార్యక్రమం తో పాటు అన్న ప్రసాదం భక్తులకుఏర్పాటు చేశారు. వర్ని చౌరస్తాలోని పవర్ హౌస్ కాంపౌండ్ లో జరిగిన ఈ కార్యక్రమంలో నిజాంబాద్ పట్టణ విద్యుత్తు ఉద్యోగులు కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అన్న ప్రసాదం స్వీకరించారు. పూజా కార్యక్రమంలో డి ఈ టెక్నికల్ ఏ రమేష్, డి ఈ ఆపరేషన్ ఎం శ్రీనివాస్, కన్స్ట్రక్షన్ వెంకటరమణ, నిజాంబాద్ టౌన్ టు ఎడి ఈ తోట రాజశేఖర్ ఏఈ ఆర్ సుమిత ,రఘునందన్ 1104 యూనియన్ కంపెనీ అధ్యక్షులు, స్థానిక లైన్స్పెక్టర్ ప్రభాకర్ రెడ్డి, ఏడీ ఈ లు ప్రశాంత్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, ఆర్ చంద్రశేఖర్, వీరేశం, నగర ఏ ఈ లు డి శ్రీనివాస్, గంగా శేఖర్, అజారుద్దీన్ ,శ్రీవిద్య, సబ్ ఇంజనీర్స్ మాలతి ,నజ్మా ,స్థానిక సిబ్బంది లక్ష్మణ్, రాజయ్య, సాయికుమార్, ఈశ్వర్, లక్ష్మీనారాయణ, శ్రీనివాస్, రంగస్వామి, సాయి చరణ్, జేఏసీ నాయకులు రాజేందర్, శివాజీ గణేష్ ,బాలేష్ కుమార్, సురేష్ కుమార్, కాశీనాథ్,పి గంగాధర్, శ్రీనివాస్, నాయిని కృష్ణ, శ్రీరామ్ మూర్తి, రాంగోపాల్, గంగారాం, గుండన్న, దాదాపు 600 మంది భక్తులు అన్నప్రసాద కార్యక్రమంలో పాల్గొన్నారు.