బతుకమ్మ, భీంగల్ : మండలంలోని పచ్చల నడుకుడ గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త జాపిరి రమేష్ వాళ్ళ సోదరుడు జాపిరి మహేష్ ఇటీవలే మరణించడంతో వారి కుటుంబాన్ని తెలంగాణ స్టేట్ సీడ్స్ కార్పొరేషన్ చైర్మన్ సుంకేట అన్వేష్ రెడ్డి గురువారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ మరణించిన మహేష్ కుటుంబానికి స్వతహాగా 25వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. అనంతరం ఇటువలె మరణించిన ఆది సురేష్ వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలపడం జరిగింది…. వీరి వెంట వేల్పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గడ్డం నర్సారెడ్డి, కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షులు గుడాల మోహన్, జిల్లా కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు టక్కురి గంగాధర్, సొసైటీ డైరెక్టర్ గట్టవుతల నర్సారెడ్డి, లింగేశ్వర్, రెడ్ క్రాస్ సొసైటీ డివిజన్ మెంబర్ అంకన్న గారి రాజశేఖర్, నెహ్రూ, ఆది చిన్న ముత్తన్న, నోముల గంగాధర్, కాంగ్రెస్ కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.