ఓటర్ నమోదు ప్రక్రియ పూర్తి చేయండి

1,075
  • సబ్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

బతుకమ్మ ,పిట్లం : సర్పంచ్ ఎన్నికలు సమీపిస్తుంది ఓటర్ నమోదు కార్యక్రమాన్ని బిఎల్వోలు ఇంటింటి సర్వే పూర్తి చేయాలని సబ్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి  ఆదేశించారు. పిట్లం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా ఆయన బుధవారం  తనిఖీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పిట్లం మండల లోని  ఎల్ఆర్ఎస్ ను కూడా త్వరగా పూర్తిచేసి అందించాలని సిబ్బందిని ఆదేశించారు. 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న యువతకు ప్రాధాన్యత ఇస్తూ ఓటర్ను నమోదు చేయించాలని బిఎల్ఓ కు ఆన్లైన్లో ఆదేశించారు. రిజిస్ట్రేషన్ కోసం వస్తున్న వారికి త్వరగా రిజిస్ట్రేషన్ చేసి ఇయ్యాలని ఉప తాసిల్దార్ ఆదేశించారు. పెండింగ్లో ఉన్న రిజిస్ట్రేషన్ లను త్వరగా పూర్తి చేయాలని కోరారు. ప్రజావాణి కి వచ్చే ఫిర్యాదులను సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప తాసిల్దార్ సుధాకర్, ఆర్ ఐ శీతల్, ఎంపీడీవో కమలాకర్, సీనియర్ అసిస్టెంట్ గోపాల్ ,సిబ్బంది ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.