బతుకమ్మ పిట్లం : రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో యువత మేలుకో డ్రగ్స్ మానుకో రెడ్ క్రాస్ సొసైటీ కమిటీ రాష్ట్ర సభ్యులు సంజీవరెడ్డి అనంతరం ఆయన మాట్లాడుతూ నేటి యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు బానిసలై తమ విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. డ్రగ్స్ వాడకం వల్ల జరిగే అనర్థాలను వివరిస్తూ యువతను చైతన్య పరచాలానే సదుద్యేశ్యం తో రాష్ట్రావ్యాప్తంగా అవగాహన ర్యాలీలు, సదస్సులు నిర్వహించాలని గవర్నర్ ఆదేశాల మేరకు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ కామారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు శివాజీ చౌక్ నుండి విద్యార్థులచే ర్యాలీ నిర్వహించరు., ఈ కార్యక్రమం లో రెడ్ క్రాస్ రాష్ట్ర కమిటీ సభ్యులు సంజీవరెడ్డి,లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ కిషన్, రెడ్ క్రాస్ బాన్సువాడ డివిజన్ చైర్మన్ వేణుగోపాల్, లయన్స్ క్లబ్ కోశాధికారి బాలు, సభ్యులు ప్రమోద్, వివిధ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు .