. . పట్టుబడిన అధికార పార్టి నేతలు
. . . రూ.1,15,790 నగధు స్వాధినం
బతుకమ్మ, నిజామాబాద్ క్రైం :
నిజామాబాద్ నగరంలోని ఆరవ టౌన్ పరిధిలోని ఎన్ఆర్ఐ కాలనీలో ఓక ఇంటిలో పెకాట అడుతున్నారని విశ్వసనీయ సమాచారం నిజామాబాద్ పోలిస్ కమీషనర్ కల్మేశ్వర్ అదేశాలతో పోలిస్ లు దాడి చేశారు. గురువారం రాత్రి పోలిస్ కమీషనర్ అదేశాల మేరకు నిజామాబాద్ సిసిఎస్ పోలిస్ లు దాడి చేశారు. పోలిస్ ల దాడిలో ఇమ్రాన్, ఇబ్రహీం ఖాన్, షెక్ సమద్, మిర్జ అహ్మద్, మోయిన్ సయ్యద్ ఫసీ, సయ్యద్ అప్రోజుద్ధిన్, సయ్యద్ జఫార్, యండి సాదిక్, సయ్యద్ జాపారుద్ధిన్ లను పట్టుకున్నారు. ఇందులో కోందరు అధికార పార్టికి చెందిన నాయకులు ఉన్నారు. వారినుంచి రూ. 1,15,790, నగదు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. పెకాటలో పట్టుబడిన తొమ్మిది మందిపై ఆరవ టౌన్ పోలిస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. పెకాట స్థావరాలపై కమీషనర్ అదేశాల మేరకు టాస్క్ పోర్స్ పోలిస్ లేదా స్థానిక పోలిస్ లు దాడి చేయడం రివాజు కాని గురువారం రాత్రి సిసిఎస్ పోలిస్ లతో పాటు స్పేషల్ పార్టిలతో దాడి చేయడం కలకలం రేపింది.
