. . . పని చేస్తున్నది ఒక్కరే వైద్యుడు
. . . సూపరింటేండేంట్ కుడా ఇంచార్జీనే
. . . ప్రభుత్వ ఆస్పత్రిలో సరిపడా వైద్యులు లేక ప్రజల ఆవస్థలు
బతుకమ్మ, బిచ్కుంద
కామారెడ్డి జిల్లా రిజర్వు నియోజకవర్గం జుక్కల్ లో పేదలకు వైద్య సేవలు అందని ధ్రాక్షాల మారాయి. అక్కడ నియోజకవర్గం కేంద్రంగా బాసిల్లుతున్న బిచ్కుంధలో 30 పడకల ఆసుపత్రి ఉన్న దాని అలనా పాలన చూసే వారు కరువయ్యారు. బిచ్కుంద మండల కేంద్రంలోని ఆసుపత్రిలో రోగులకు సరిపడా వైద్యులు లేక ప్రజలు ఆవస్థలు పడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో వైద్య సేవలకు నిజామాబాద్ లేదా, కామారెడ్డి ప్రాంతాలకు వేళ్లాల్సిన పరిస్థితి ఉండేది. కోత్త జిల్లాగా కామారెడ్డి ఎర్పడినప్పటికి కీలకమైన జుక్కల్ నియోజకవర్గంలో పేదలకు మాత్రం సరైనా వైద్య సేవలు అందేంచే వారు కరువయ్యారు. 30 పడకల ఆసుపత్రిలో వైద్యం కోసం జుక్కల్, బిచ్కుంద, డోంగ్లి, మద్నూర్ ప్రాంతాల నుంచి ప్రజలు వస్తున్న వైద్యులు లేక అక్కడి నుంచి ప్రైవేట్ కు వేళ్లాల్సిన పరిస్థితి నెలకోంది.
మారు మూల మండలం ఐనా బిచ్కుంధ ఇపరిస్థితికి కారణం వైధ్యుల కోరత. సరిపడా సిబ్బంది ఉన్న ఓక్కరే రెగ్యూలర్ వైద్యుడు ఉన్నారు. రెండవ వైద్యుడు ఇంచార్జీ సూపరింటేండేంట్ కు బాన్సువాడలో అధనపు వైద్యుడుగా ఉన్నారు. ఈ సందర్భంగా పలు యూనియన్ నాయకులు,స్థానికులు మాట్లాడుతూబిచ్కుంద మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి ప్రభుత్వం ఇద్దరు డాక్టర్లను నియమించింది. వీరిలో కేవలం డాక్టర్ భరత్ మాత్రేమే విధులకు హాజరై సేవలు అందిస్తున్నాడు. మరో వైద్యుడు కాళిదాసు మాత్రం విధులకు హాజరుకావట్లేదు. సీజనల్ వ్యాధుల ప్రభావంతో మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు భయంతో ఆందోళన చెందుతుంటే బాధ్యతగల వైద్యుడు విధులకు ఎగనామం పెట్టడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నించారు. గత వారం రోజులుగా వరుసగా డ్యూటీకి రావట్లేదన్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో వైద్య సిబ్బంది సెలవులు సైతం రద్దు చేసుకుంటున్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. నియోజకవర్గంలో పేదలకు ఎదైన జబ్బు చేస్తే అటు నిజామాబాద్ లేదా కామారెడ్డి లేకపోతే బాన్సువాడలోని ఎరియా ఆసుపత్రి దిక్కుగా మారింది. పోరుగున ఉన్న మహరాష్ర్ట ప్రజలు కుడా వైద్యం కోసం బిచ్కుంధ ఆసుపత్రికి వస్తున్న వైద్యులు లేక తిరిగి వేళ్లిపోతున్నారు. ఉన్న ఓక్క వైద్యుడు సెలవు పెట్టిన, లేద ఎక్కడికైనా వేళ్లిన వైద్య సేవలు దోరకని పరిస్థితి నెలకోంది. పార్మసిస్టులు, నర్స్ లు మాత్రం డాక్టర్ లుగా మందు బిల్లలు ఇచ్చి పంపుతున్నారు.
ప్రభుత్వ ఆస్పత్రి సేవలపై ఆధారపడే నిరుపేదలు వైద్యుని నిర్లక్ష్యం మూలంగా ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. అందుబాటులో డాక్టర్లు లేకపోవడం వలన హాస్పటల్ అభివృద్ధి సైతం కుంటు పడుతుందన్నారు. ఇప్పటికే బాధితులు ఇబ్బందులపాలు అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఈ విషయంపై జిల్లా ఉన్నతాధికారులు మరియు జిల్లా వైద్య అధికారులు తక్షణమే స్పందించి రెగ్యులర్ డాక్టర్ నియమించాలని కోరారు. ఈ విషయమై ఆసుపత్రి సుపరింటేండేంట్ కాళిదాసు ని ఫోన్ ద్వారా బతుకమ్మ సంప్రదించగా ఇన్చార్జిగా ఉన్నాను కాబట్టి పర్యవేక్షణ చేయలేకపోతున్నాను అని సమాధానం ఇవ్వడం గమనార్హం.