బతుకమ్మ, నిజామాబాద్ క్రైo – గుండెపోటుతో ఒక ఎస్సై మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం నిజామాబాద్ నగరంలోని గాయత్రి నగర్ లో చోటుచేసుకుంది. గాయత్రి నగర్ చెందిన దత్తాద్రి ( 52) నగరంలోని ఒకటవ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా పని చేస్తున్నాడు. ఉదయం వేళ వ్యాయామం చేస్తుండగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు.