వనమహోత్సవం కరువైన ఉత్సాహం

1,641

మోర్తాడ్, బతుకమ్మ:  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వనమహోత్సవంలో నిధులు లేక ఉత్సాహం కరువైంది. నర్సరీల్లో మొక్కలున్నాయి. గుంతలు తీసేందుకు, మొక్కలు నాటేందుకు కూలీలు సిద్ధంగా ఉన్నా నిధులు లేకపోవడంతో లక్ష్యం దిశగా వనమహోత్సవం సాగడం లేదు. జిల్లాలో మొక్కలు నాటడానిన జూలైలో ప్రారంభించారు. రోడ్లకు ఇరువైపులా ఖాళీ ప్రదేశాలతోపాటు చెరువులు, కాలువ కట్టలపై, ఖాళీ ప్రదేశాల్లో పెద్ద ఎత్తున 36 శాఖల సిబ్బంది ఉపాధి కూలీలతో మొక్కలు నాటడం ప్రారంభించారు. కానీ లక్ష్యం పూర్తి కాకుండానే మధ్యలో ఆగిపోయింది.

రెండేళ్లలో జిల్లాలో హరితహారం

సంవత్సరం        లక్ష్యం

2022 – 23     18లక్షలు

2023 – 24     16లక్షలు

హోం సీడ్

2022 – 23     12లక్షలు

2023 – 24     10లక్షలు

రెండు సంవత్సరాల్లో 34 లక్షల మొక్కలు ప్లాంటేషన్ ద్వారా నాటగా, 22 లక్షలను ఇంటింటికీ పంపిణీ చేసినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

ఈ ఏడాది లక్ష్యం

2024 – 25     19.61 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం

హోమ్ సీడ్ 5.5 లక్షలు

వన మహోత్సవం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 16 లక్షల మొక్కలు నాటినట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇంకా 3.61 లక్షల మొక్కలు నాటాల్సి ఉంది. ఆగస్టు చివరి వరకు లక్ష్యం పూర్తి చేయాల్సి ఉన్నా లక్ష్యం పూర్తి కాకుండా మధ్యలో నిలిచిపోయింది.

 

మొక్కలు నాటేందుకు కమ్యూనిటీ, ప్లాంటేషన్, హరిత వనంలో నిబంధనల ప్రకారం గుంతలను తవ్వాలి. రహదారుల వెంట రెండు ఫీట్లు గుంతలు తవ్వాలి. ఒక్కో గుంతకు రూ.27, మొక్క నాటినందుకు రూ.12 కూలీ చెల్లిస్తున్నారు. ఉపాధిహామీ పని దినాలు పూర్తి కావడంతో కూలీలకు చెల్లించడానికి తగిన మేర నిధులు లేకపోవడంతో నాటాల్సిన 3.61 లక్షల మొక్కలను నాటకుండా అలాగే వదిలేశారు. దీంతో వన మహోత్సవం లక్ష్యం పూర్తి కాకుండా మధ్యలో నిలిచిపోయింది. ఫలితంగా నర్సరీల్లోనే మొక్కలు ఉండిపోయాయి.

 

ఉన్నతాధికారుల దృష్టికి

సాయాగౌడ్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి

వన మహోత్సవం ప్రస్తుత పరిస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాను. అధికారుల నుంచి ఆదేశాలు రాగానే చర్యలు తీసుకుంటాం. ప్రస్తుతం హర్టికల్చర్ ను ప్రోత్సహిస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.

Leave A Reply

Your email address will not be published.