ఇతరులతో మాట్లాడుతుందని రెండో భార్యను మట్టుబెట్టిన రిటైర్డ్ జవాన్

1,169

బతుకమ్మ, డిచ్ పల్లి : గత నెల 29న డిచ్ పల్లి మండల కేంద్రంలో జరిగిన వివాహితది అనుమానస్పధ మృతి కాదని భర్తే హత్య చేశాడని పోలిస్ లు విచారణలో వెల్లడైంది. అదివారం డిచ్ పల్లి పోలిస్ స్టేషన్ లో ఎర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిచ్ పల్లి సిఐ మల్లేష్ కథనం ప్రకారం కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం యాచారం గ్రామానికి చెందిన రాథోడ్ విజయ అలియాస్ మీనాక్షి కి 2016 లో వెస్లి నగర్ కు చెందిన రిటైర్డ్ జవాన్ గబ్బర్ సింగ్ అనే వ్యక్తితో రెండవ వివాహం జరిగింది. గత సంవత్సరం నుంచి తన రెండవ భార్య విజయ తో కలిసి హైదరాబాద్ ఉంటున్న గబ్బర్ సింగ్ కొన్ని రోజుల క్రితం డిచ్పల్లిలోని ఆర్ఎస్ లోని తన ఇంటికి తీసుకొచ్చాడు. అయితే గత నెల 29న విజయ ఇంట్లో అనుమానాస్పదంగా ఉరి వేసుకుని మృతి చెందింది. దీంతో విజయ మృతి పై మృతురాలి తల్లి డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో భాగంగా విజయను భర్త కొట్టి చున్నీతో గొంతు బిగించి హత్య చేసి అనంతరం ఫ్యానుకు వేలాడదీసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు సిఐ మల్లేష్ వెల్లడించారు. అయితే గబ్బర్ సింగ్ తన భార్య విజయ ఇతరులతో తరుచు పోన్ లో మాట్లాడడం వల్లే అనుమానంతో హత్య చేసినట్లుగా తెలిపారు.గబ్బర్ సింగ్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించామని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.