నిజాంసాగర్ నుంచి 20వేల క్యూసెక్కుల నీటి విడుదల          

1,395

. నాలుగో గేటును ఎత్తిన అధికారులు

నిజాంసాగర్ , బతుకమ్మ: నిజాంసాగర్ ప్రాజెక్టు మరో గేటును అధికారులు ఎత్తారు. మొత్తం నాలుగు గేట్ల ద్వారా 20వేల క్యూసెక్కుల నీటిని దిగువన మంజీరలోకి విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో పెరిగిన కారణంగా బుధవారం  ఓ గేటును ఎత్తిన అధికారులు, సింగూరు ప్రాజెక్టు గేట్లను ఎత్తడంతో గురువారం మరో రెండు, శుక్రవారం ఒకటి మొత్తం నాలుగు గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 20వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, దానికి సమానంగా అవుట్ ఫ్లో ఉంది. ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1405(17.802 టీఎంసీలు) అడుగులు కాగా, 1404.64 (17.282 టీఎంసీలు) అడుగుల మేర నీరు నిల్వ ఉంది. సింగూరు నుంచి వరద ప్రాజెక్టులోకి చేరగానే అదనంగా గేట్లను ఎత్తే అవకాశం ఉంది.

Leave A Reply

Your email address will not be published.