- బిజెపి మండల శాఖ అధ్యక్షులు ఉప్పరి రమేష్
- సభ్యత్వ నమోదు విజయవంతం చేయాలి
బతుకమ్మ భిక్కనూర్: జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులు సైనికులుగా పనిచేయాలని బిజెపి పార్టీ మండల శాఖ అధ్యక్షులు ఉప్పరి రమేష్ పిలుపునిచ్చారు. ఆదివారం నాడు ఆయన భిక్కనూరు మండలం రామేశ్వర్ పల్లి గ్రామంలో గల మార్కండేయ ఆలయంలో బిజెపి సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి జిల్లా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ జిల్లా ప్రధాన కార్యదర్శి నరేందర్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ పార్టీ దేశవ్యాప్తంగా అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీ అని అలాగే కామారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాలను విజయవంతం చేయాలని సూచించారు. ప్రతి గ్రామంలో బూత్ స్థాయిలో సభ్యత్వాలు నమోదు చేయించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి మండల కన్వీనర్ వల్ల కొండ రవీందర్ రెడ్డి కో కన్వీనర్ లింగంపేట యాదగిరి గౌడ్ ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు తిరుమలేష్ గణేష్ రెడ్డి బత్తుల ఆనంద్ బూత్ అధ్యక్షులు మరియు గ్రామ అధ్యక్షులు మండల కమిటీ, గ్రామ శాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.