- ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్
బతుకమ్మ, ఎల్లారెడ్డి : త్వరలోనే అర్హులందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను అందజేస్తామని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్ అన్నారు. మండల కేంద్రంలో నిర్మిస్తున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లను సోమవారం పరిశీలించారు. సంబంధిత కాంట్రాక్టర్ తో మాట్లాడి పనుల గురించి అడిగి తెలుసుకున్నారు.
కరెంట్, డ్రైనేజీ ఇతర మౌలిక సదుపాయాలను వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణానికి కావలసిన మరో 40 లక్షల నిధులను స్పెషల్ డెవలప్మెంట్ ఫ్రెండ్స్ నుండి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మంజూరు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఈ, డి ఈ, మున్సిపల్ అధికారులు, కాంట్రాక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.