యుజిసి నెట్ పరీక్షలు ప్రారంభం

586

బతుకమ్మ,  నిజామాబాద్

యుజిసి నెట్ ఫేస్ -2  పరీక్షలు మంగళవారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు ఈ  నెల 28 న  ప్రారంభమై సెప్టెంబర్ 4 వరకు కంప్యూటర్ బేసిడ్ టెస్ట్ (సిబిటి)పద్ధతిలో నిజామాబాద్ లోని బోధన్ రోడ్ లో గల ఎవి ఎంటర్ ప్రైజెస్ పరీక్ష కేంద్రంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని నిజామాబాద్ జిల్లా నేషనల్ టెస్ట్ ఏజెన్సీ కో-ఆర్డినేటర్ భాస్కర్ మెరిగ తెలిపారు. ఈ పరీక్షలను రెండు షిఫ్టులలో నిర్వహిస్తుండగా ఉదయం షిప్ట్ 9 నుంచి 12 గంటల వరకు, రెండవ  షిప్ట్ మధ్యాహ్నం  3 నుంచి 6 గంటల వరకు ఉంటాయన్నారు.  పరీక్షల అబ్జర్వర్ గా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ ను నియమించడం జరిగిందన్నారు. ఈ పరీక్ష సజావుగా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. జూన్ 18న ఆఫ్ లైన్ పద్ధతిలో జరిగిన యు జి సి నెట్ పరీక్ష రద్దయిన విషయం విధితమే. ఈ పరీక్షకు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్న సెల్ .8978198421కు సంప్రదించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.