గవర్నమెంట్ స్కూల్ కు తాళం వేసిన కాంట్రాక్టర్

1,759

కామారెడ్డి, బతుకమ్మ: బిల్లులు చెల్లించడం లేదనే కోపంతో ఓ కాంట్రాక్టర్ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశాడు. ఈ ఘటన కామారెడ్డి మండలంలోని చిన్నమల్లారెడ్డిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో బిల్డింగ్ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తనకు పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని గురువారం పాఠశాలకు తాళం వేశాడు. దీంతో ఆరు, ఏడు తరగతుల విద్యార్థులు చెట్ల కింద కూర్చున్నారు. పాఠశాల హెచ్ఎం బిల్లుల విషయం ఎన్నోసార్లు డీఈవోకు తెలిపినా ఫలితం లేకపోవడంతోనే కాంట్రాక్టర్ పాఠశాలకు తాళం వేసినట్లు తెలిసింది.

Leave A Reply

Your email address will not be published.