మోర్తాడ్ ఎస్సై విక్రమ్ కు సన్మానం

1,248

బతుకమ్మ మోర్తాడ్ : మోర్తాడ్ మండలం ఎస్సైగా బాధ్యతలు తీసుకున్న విక్రమ్ భూపల్లిని గురువారం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ముత్యాల రాములు శాలువాతో ఘనంగా సన్మానించి, మిఠాయిలు తినిపించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ వచ్చే పండుగలను పురస్కరించుకొని మండలంలోని ప్రజలు ప్రతి ఒక్కరు పోలీసులకు సహాయ సహకారాలు అందించాలని శాంతియుతంగా భక్తిశ్రద్ధలతో అందరం కలిసి పండుగలు జరుపుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సుంకేట్ సంతోష్, ధర్మోరా దేవేందర్, సుధీర్ నాయక్, ఎంసీ గంగారం, ధర్మోరా అనిల్, శేట్ పల్లీ మధు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.