గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలి

1,579

బతుకమ్మ భిక్కనూరు: గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా నిర్వహించుకోవాలని భిక్కనూర్ సిఐ సంపత్ కుమార్ అన్నారు. పద్మశాలి ఫంక్షన్ హాల్ లో ఎస్సై సాయికుమార్ ఆధ్వర్యంలో మండల శాంతి కమిటీ సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐ మాట్లాడుతూ గణేష్ మండపాల వద్ద తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి గణేష్ మండపానికి తప్పకుండా పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామ యువజన సంఘాల సభ్యులు, ఏ ఎస్ఐ జగదీష్ పోలీస్, మల్లారెడ్డి,సిబ్బంది పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.