బతుకమ్మ, కామారెడ్డి: భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కామారెడ్డి జిల్లాలోని ప్రభుత్వ ,ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, ఐటిఐలు, రెసిడెన్సి విద్యా సంస్థలకు ఈనెల 2 న సెలవును ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్ వన్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, రెసిడెన్షియల్ పాఠశాలలు, కళాశాలలు ఈ ఆదేశాలను అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
