బ్రిడ్జి పై ప్రవహిస్తున్న వర్షపు నీరు
. . .బొప్పాపూర్ కు రాకపోకలు నిలిపివేసిన అధికారులు
బతుకమ్మ , రూద్రుర్ : శనివార్ రాత్రి నుండి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షానికి రుద్రూర్ – బొప్పాపూర్ గ్రామానికి ఆదివారం పోలీసు, రెవిన్యూ అధికారులు రాకపోకలు నిలిపివేశారు. మండల కేంద్రంలోని రుద్రూర్ గ్రామ శివారులోని చెరువు కట్ట నుండి బొప్పాపూర్ గ్రామానికి వెళ్లే బ్రిడ్జి పై నుండి వర్షపు నీరు ప్రవహిస్తుండడం వలన బొప్పాపూర్ గ్రామానికి రాకపోకలు నిలిపివేశారు. ఈ సందర్బంగా ఎస్సై పి. సాయన్న, ఆర్ ఐ నజీర్ మాట్లాడుతూ.. కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు ఎవరు బయటకు రావద్దని, అత్యవసర సమయాల్లోనే బయటకు వెళ్లాలని తెలిపారు. అదేవిధంగా విద్యుత్ స్థంభాలను తకవద్దని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు.
