బాలిక గల్లంతు కథ విషాదంతం

1,311
  • . . . దోబిఘాట్ వద్ధ లభ్యమైన అను మృతదేహం లభ్యం
  • . . . శోకసంద్రంలో కుటుంబ సభ్యులు
  • బతుకమ్మ నిజామాబాద్ సిటీ..

బుధవారం సాయంత్రం తన ఇంటిముందు అడుకుంటు ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిన అనన్య అలియాస్ అన్ను(2) గల్లంతు కథ విషాదాంతంమైంది. గురువారం ఉదయం 6గంటల తరువాత పాప మృతదేహం పిఎప్ కార్యాలయం వద్ధ గల దోబిఘాట్ వద్ధ లభ్యమైంది. నిజామాబాద్ నగరంలోని వర్ని రోడ్ లో గల ఆనంద్ నగర్ ప్రాంతంలో నాలుగు గంటల ప్రాంతంలో  అనన్య తోటి స్నేహితులతో కలిసి ఆడుకునే క్రమంలో ర డ్రైనేజీలో పడి మృతి చెందిన ఘటన విషాదాన్ని మిగిల్చింది. నిన్న సాయంత్రం నుండి గురువారం ఉదయం ప్రత్యేక రెస్క్యూ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది గలిస్తున్న నేపథ్యంలో అదే డ్రైనేజ్ పరిధిలో 100 మీటర్ దూరంలో అనన్య మృతదేహాన్ని గుర్తించి బయటకు తీసుకొచ్చినట్లు రెస్క్యూ టీం సిబ్బంది తెలిపారు. అయితే తమతో కలిసి సరదాగా ఆడుతూ పాడుతూ తిరిగిన అనన్య నేడు అనంత లోకాలకు వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు, కాలని వాసులు తీవ్ర శోకసంద్రం లో మునిగిపోయారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఇలాంటి ఘటనలు కొత్తవి ఏమీ కావు గత వర్షాకాలం సీజన్లో కూడా గౌతమ్ నగర్ చంద్రశేఖర్ కాలనీ పరిధిలో ఇలాంటి తరహా ఘటననే చోటుచేసుకుంది. వర్షపు దాటికి  మురుగు కాలువలలో పడి చిన్నారులు మృతిచెందిన ఘటనలు కూడా ఉన్నాయి

The story of the girl's disappearance is tragic

Leave A Reply

Your email address will not be published.