
బతుకమ్మ, ఎల్లారెడ్డి: చెరుకు పంటను అడవి జంతువుల నుంచి రక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెకు తగిలి చిరుత మృతి చెందింది. కేసు అవుతుందేమోనని భయపడిన రైతు చిరుత కళేబరాన్ని గుట్టుచప్పుడుకాకుండా పాతిపెట్టాడు. ఈ ఘటన ఎల్లారెడ్డి మండలం హాజీపూర్ గ్రామపంచాతీ పరిధిలోని కట్టకింది తండాలో చోటు చేసుకుంది. నూద్యానాయక్ అనే రైతు పొలంలో చిరుత మృతి చెందగా, ఆయన ఈ విషయాన్ని బయటికి తెలియనీయలేదు. చెరుకుతోటలోనే గోయి తవ్వి చిరుత కళేబరాన్ని పాతిపెట్టాడు. విషయం తెలుసుకున్న ఎల్లారెడ్డి ఫారెస్ట్ అధికారులు పాతిపెట్టిన చితరు కళేబరాన్ని బుధవారం ఉదయం వెలికి తీయించారు. అక్కడే పోస్టుమార్టం నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు, ఈ ఘటనపై సమగ్రంగా విచారణ చేపడుతున్నారు.