బతుకమ్మ, నిజామాబాద్ క్రైమ్ : వ్యాపారి పాత విశ్వనాథం హత్య కేసులో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం ఆర్థిక లావాదేవీల కారణంగానే విశ్వనాథం ను హత్య చేసినట్లు తెలిపారు. ఈ హత్య కేసులో లక్ష్మీబాయి, ఆమె అల్లుడు రాజశేఖర్, పోచయ్య, జంగం శంకరప్ప అనే నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు