- ఎల్లారెడ్డి నియోజకవర్గంలో హాట్ టాఫిక్ గా తహసీల్ధార్ సస్పెన్షన్
- అవినీతి, ఆరోపణల నేపథ్యంలో నాగిరెడ్డిపేట్ తహసీల్ధార్ పై వేటు
- అవినీతి, అక్రమాలను ఉపేక్షించేది లేదని ఎమ్మెల్యే వార్నింగ్
- అధికారుల్లో దడ
బతుకమ్మ, ఎల్లారెడ్డి – కామారెడ్డి జిల్లాలో కొత్తగా కాంగ్రెస్ ఏర్పడిన తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ అధికారులకు పక్కా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వం అందించే సంక్షమ ఫలాలు వారికి అందించాలని ఈ విషయంలో తగ్గేది లేదని, అవినీతిని ఉపేక్షించేది లేదని చెప్పారు. అంతేగాకుండా ఎన్నికలకు ముందు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే ఒక్క రూపాయి వేతనం కూడా తీసుకోకుండా ఎమ్మెల్యేగా వచ్చే వేతనాన్ని ప్రజా సంక్షేమానికై ఖర్చు చేస్తానని ఇచ్చిన హామీ మేరకు దానిని తూచ తప్పకుండా ఆచరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా ప్రజలకు కరోనా కాలంలో సేవ చేసిన ఒరవడిని ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు గడిచిన తర్వాత నియోజకవర్గంలో ఏ ప్రాంత ప్రజలకు ఏయే అవసరాలు ఉన్నాయో స్వయంగా కనుక్కొని వాటిని నెరవేర్చేందుకు కష్టపడుతున్నారు.అయితే కొత్త ప్రభుత్వంలో కొందరు ముదురు అధికారులు మాత్రం గతంలో మాదిరిగానే తమ నైజంను కొనసాగిస్తున్నారు. అదే కోవలో నాగిరెడ్డిపేట్ తహసీల్ధార్ లక్ష్మణ్ ఏకంగా ప్రతిపనికి ఒక రేటును ఫిక్స్ చేసి వసూళ్ళకు తెగబడ్డాడు. మధ్యవర్తులను నియమించుకుని ఈ పనని చక్కబెట్టాడు. కానీ ఈ విషయం ఎమ్మెల్యేకు తెలియడంతో ముందుగా వార్నింగ్ ఇచ్చి పద్దతి మార్చుకోవాలని సూచించినా పెడచెవిన పెట్టాడు. ఈ నేపథ్యంలోనే ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకుని నేరుగా జిల్లా కలెక్టర్ కు తహసీల్ధార్ అవినీతి గురించి ఒక నజర్ వేయాలని సూచించినట్లు సమాచారం. ఎమ్మెల్యే నుంచి తహసీల్ధార్ వ్యవహర శైలిపై సూచనలు రావడంతో అప్రమత్తమైన జిల్లా కలెక్టర్ ఆర్డీవో ద్వారా విచారణ చేయించారు. విచారణలో లక్ష్మణ్ వ్యవహర శైలి వాస్తవంగానే వసూళ్ళ పర్వం కొనసాగుతున్నట్లు నివేదిక అందడంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో నియోకజవర్గంలో అధికారుల్లో దడ మొదలయింది.ప్రధానంగా రెవెన్యూ, పోలీసు, విద్య, వైద్య రంగాల్లో అవినీతిని, అక్రమాలను ప్రజలకు అందుబాటులో లేకపోతే తమపరిస్థితి ఏంటని అధికారుల్లో వణుకు ప్రారంభమైంది. తొలిసారిగా కామారెడ్డి జిల్లాలో అవినీతి, ఆరోపణల నేపథ్యంలో ఎల్లారెడ్డిలో తహసీల్ధార్ ఔట్ కావడంతో తర్వాత ఎవరి వంతని చర్చ మొదలయింది. ఈ విషయం ఇప్పటికే నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది. అవినీతి అధికారులు అక్రమాలకు పాల్పడే వారు తీరు మార్చుకోవాలని ఎమ్మెల్యే అనుచరులు కూడా ఎమ్మెల్యే చెబుతున్నారు. ఇప్పటి వరకు అతిపెద్ద నియోజకవర్గంలో ఒకటైనా ఎల్లారెడ్డిలో మొదటిసారిగా రెవెన్యూలో ఒకరిపై వేటు పడగా మిగిలిన ప్రధాన శాఖల్లోనూ ఇదే టాపిక్ గా మారింది. ప్రజాసంక్షేమాన్ని కోరి ఎమ్మెల్యే ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తుండగా అధికారులు మాత్రం తమ తీరును మార్చుకోకుండా అవినీతిని ప్రోత్సహిస్తుండడం ఎమ్మెల్యేకే మింగుడుపడడం లేదు. ప్రజలతో ఉన్న కనెక్షన్ ఎలాంటి బ్రేకులు పడొద్దంటే అవినీతి, అక్రమాలపై భరతం పట్టాలన్న ఎమ్మెల్యే సూచనలను అధికారులు ఏ మేరకు ఆచరిస్తారో వేచి చూడాలి. ఇటీవల కాలంలో ఎమ్మెల్యే మధన్ మోహన్ విదేశీ పర్యటనతో పాటు ఢిల్లీలో పదవి కోసం లాబీయింగ్ చేస్తుండగా ఇక్కడ జరుగుతున్న వ్యవహరాలనుఎప్పటికప్పుడు ఆయన తెలుసుకుంటునే నియోజకవర్గంలో తనదైన పట్టును నిలుపుకునే ప్రయత్నం చేస్తున్నారు.కాంగ్రెస్ లో ఇటీవల రెండవ గ్రూప్ ప్రారంభం కాగా పార్టీ పరంగా ఇబ్బందులు ఎదుర్కొవద్దని ప్రజలతో ప్రధానంగా క్యాడర్ తో ఉన్న సత్సంబంధాలను కొనసాగించేందుకే మధన్ మోహన్ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన అనుచరులు చెబుతున్నారు. పదువులు ఉన్న లేకపోయినా గతంలో మాదిరిగానే ప్రజలకు సేవ చేసే ఒరవడిని మాత్రం కొనసాగిస్తారని ఆయన పేరును చెడిపోకుండా ఉండేందుకు అధికారుల్లో తనమన తేడా లేకుండా తప్పు చేస్తే శిక్ష తప్పదని చెప్పేందుకే తహసీల్ధార్ పై వేటు వేయించారని అధికారుల్లో చర్చ మొదలయింది. తహసీల్ధార్ తర్వాత తమవైపు నజర్ రాకుండా ఉండేందుకు అధికారులు కూడా ప్రజల్లో అందుబాటుల్లో ఉండేందుకు, ఫిర్యాదులు రాకుండా ఉండేందుకు కసరత్తులు మొదలుపెట్టారని చెప్పొచ్చు.