. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సగ్వాన్
బతుకమ్మ, పిట్లం : భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. పిట్లం మండల కేంద్రం నుంచి ఆదివారం మధ్యాహ్నం నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్ లో యన మాట్లాడారు. జీపీల కార్యదర్శులు, అధికారులు స్థానికంగా ఉండాలని అన్నారు. ప్రమాదాలబారిన పడిన వారిని కాపాడే బాధ్యత పోలీసుశాఖపై ఉందని ఎస్సై రాజుకు సూచించారు. చెరువులు, కుంటలకు బుంగలు ఏర్పడే అవకాశాలున్నాయని, నీటివనరుల వద్ద సిబ్బందిని కాపలా ఉంచాలని ఇరిగేషన్ ఏఈని ఆదేశించారు. మండలంలో వర్షపాతం వివరాలను తహసీల్దార్ వేణుగోపాల్ గౌడ్ ను అడిగి తెలుసుకున్నారు.