- లిఫ్టు లో చిక్కుకున్న పిల్లలు
- అరగంట పాటు పిల్లల నరకయాతన
బతుకమ్మ, నిజామాబాద్ ; నిజామాబాద్ నగరంలోని ఆర్మూర్ రోడ్ లో గల సాయి ప్రియ నగర్ ప్రాంతంలో గల సాయి ఆటకారి అపార్ట్ మెంట్ లోని లిఫ్టులో సాంకేతిక లోపంతో నిలిచిపోయింది. ఆ సమయంలో లిఫ్టులో ఐదుగురు చిన్నారులు ఉండడంతో లిఫ్టులోనే ఇరుక్కుపోయారు. ఈ సంఘటన గురువారం రాత్రి జరిగింది.

సాయి అత్కారి అపార్ట్మెంట్లోని వివిధ ప్లాట్లలో ఉండే చిన్నారులు విరాజిత్, విహాన్, దన్వీ, అద్వైత్, విక్షిత్ లు లిఫ్టులో వెళుతుండగా సాంకేతిక లోపంతో లిఫ్ట్ మధ్యలోనే నిలిచిపోయింది. దానితో చిన్నారుల కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు తల్లడిల్లి పోయారు. చిన్నారులు లిఫ్టులు ఇరుక్కుపోవడంతో వారి ఆహాకారాలతో అపార్ట్మెంట్లో అలజడి రేగింది.
సంబంధిత బిల్డర్ కు ఫోన్ చేసిన స్పందించలేదని అపార్ట్మెంట్ వాసులు తెలిపారు చివరకు మెకానిక్ ను రప్పించి లిఫ్ట్ ను తెరిచి పిల్లలను కాపాడారు. బిల్డర్ నాసిరకపు పనుల కారణంగానే తమకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తాయని అపార్ట్మెంట్ వాసులు వాపోయారు. పిల్లలు క్షేమంగా లిఫ్ట్ నుంచి బయటకు రావడంతో తల్లిదండ్రులు హమ్మయ్య బతికిపోయామని అనుకోవడం గమనార్హం.
