బతుకమ్మ, కామారెడ్డి:
కామారెడ్డి పట్టణంలోని శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 వ జయంతి వేడుకలు జరిగాయి. అదివారం ఉదయం ఈ సందర్బంగా సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ ,జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శెట్కార్ ,కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియ లు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు తెలంగాణ పౌరుషానికి ప్రతిక సర్వాయి పాపన్న అని కోనియాడారు. ప్రభుత్వం బిసి డిక్లరేషన్ కు కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి పట్టణ గౌడ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.