- కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు ఎన్నిక విషయంలో వివాదం
- దళితులపై దాడి చేసి నందుకు కేసు నమోదుబతుకమ్మ, నిజామాబాద్ క్రై0 : గ్రామంలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ఎన్నిక విషయంలో తలదూర్చి దళితులైన ఇద్దరు సోదరులను కులం పేరుతో దూషించి దాడి చేసిన ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం కింద కేసు నమోదు అయింది. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో ఈనెల 17న నిజామాబాద్ రూరల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన పైసా చిరంజీవి అనే విద్యుత్ శాఖ లైన్మెన్, పైసా వంశీ అనే సహకార శాఖ సొసైటీ సీఈఓ పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేశారు. ఈనెల 15న గ్రామంలోని పెద్దమ్మ తల్లి గుడి వద్ద కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడి ఎన్నిక విషయంలో చిక్కిల కృష్ణ అతని సోదరుడు చిక్కిల స్వామి పై అది గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులైన చిరంజీవి, వంశీ లు కులం పేరుతో దూషించి దాడి చేశారని బాధితులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఇద్దరు అన్నదమ్ములపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు అయింది.
Prev Post
Next Post