బతుకమ్మ, నిజామాబాద్ సిటీ : కాంగ్రెస్ భవన్ వద్ద శుక్రవారం క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్ బిన్ హందన్, నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కేశ వేణు అధ్యక్షతన జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ హందన్ మాట్లాడుతూ భారతదేశంలో బ్రిటిష్ పాలనలో అనచివేతకు గురైన ప్రజలకు స్వాతంత్రం కల్పించడానికి బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పారద్రోలడానికి మహాత్మా గాంధీ క్విట్ ఇండియా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లారు అని ఆయన అన్నారు. ఆయన ప్రారంభించిన క్విట్ ఇండియా ఉద్యమం ద్వారా భారత ప్రజలకు స్వాతంత్రం లభించింది అని, కానీ ప్రస్తుతం బ్రిటిష్ వారి వారసులుగా దేశంలో బిజెపి ప్రభుత్వం మతాల మధ్య చిచ్చులు పెడుతూ దేశ ప్రజల ఐక్యతను దెబ్బతీస్తుందని ,స్వాతంత్ర ఉద్యమ సమయంలో దేశాన్ని సమైక్యంగా ఉంచాలని ఎందరో మహనీయులు ప్రాణ త్యాగాలు చేస్తే ప్రస్తుతం బిజెపి దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుందని ,బిజెపి దేశభక్తి పనులు ఒక్కటి కూడా చేయకుండా దేశాన్ని నాశనం చేసే పనులు చేస్తుందని ఆయన అన్నారు. ఆనాడు బ్రిటిష్ వారిని భారతదేశం నుండి పారద్రోలడానికి క్విట్ ఇండియా ఉద్యమం ఏ విధంగా జరిగిందో ప్రస్తుతం క్విట్ బిజెపి, ఉద్యమం జరిగి బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షులు కేశ వేను మాట్లాడుతూ బ్రిటిష్ వారిని దేశం నుండి పారద్రోలడానికి మహాత్మ గాంధీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించి డు ఆర్ డై అనే నినాదాన్ని ఇచ్చారని, అలాగే అఖిల భారత కాంగ్రెస్ కమిటీ భారతదేశం నుండి క్రమబద్ధమైన బ్రిటిషు ఉపసంహరణ” కోరుతూ భారీ నిరసనను ప్రారంభించిందని ఆయన అన్నారు. అదేవిధంగా సోనియా గాంధీ ఆదేశాల మేరకు శుక్రవారం జాతీయ యువజన కాంగ్రెస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తూ అనుబంధ సంస్థగా ప్రకటించారని ,తద్వారా దేశంలో యువకుల యొక్క సేవలను ఉద్దేశాభ్యున్నతికి ఉపయోగపడుతుందని, యువత దేశభక్తితో దేశసేవకు నిమగ్నం అయ్యే ఆలోచనతో తాను యువజన కాంగ్రెస్ ను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారని, ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లాలోని యువజన కాంగ్రెస్ నాయకులందరికీ యువజన కాంగ్రెస్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతిరెడ్డీ రాజారెడ్డి,జిల్లా ఎన్ఎస్యుఐ అధ్యక్షులు వేణు రాజు,రం భూపాల్ , బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కేశ మహేష్ సేవదల్ అధ్యక్షులు సంతోష్, జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రితం, వినయ్, శోభన్, అవీన్, శుభం, తదితరులు పాల్గొన్నారు.