భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు

854

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ఆషాడమాసం శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని నాగుల పంచమి పండగ సందర్భంగా మహిళలు పెద్ద ఎత్తున నగరంలోని పలు నాగదేవత ఆలయాలు, పుట్టలో మహిళా భక్తులు పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఎల్లమ్మ గుట్టలోని ఎల్లమ్మ తల్లి ఆలయం, పోచమ్మ గల్లి లోని పోచమ్మ ఆలయం, నాగేంద్రుడి ఆలయం, ముబారక్ నగర్ లోని పెద్దమ్మ తల్లి ఉన్న నాగ దేవతకు మహిళలు ప్రత్యేకంగా పూజలు చేసి అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తమ కుటుంబ సౌభాగ్యం, రక్షణ కోసం నాగేంద్రునికి ప్రత్యేకంగా పాలు మొక్కులు తీర్చుకున్నారు. దీంతో వాళ్ళు ఆలయాల్లో ఆధ్యాత్మిక శుభ సంతరించుకుంది.

Nagula Panchami celebrations with devotion

Leave A Reply

Your email address will not be published.