వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలి

663

. . . మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే కేసులు

. . . ఎస్సై మనోజ్ కుమార్

బతుకమ్మ, ఇందల్వాయి

వాహనదారులు బయటికి వెళ్ళేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, లేకపోతే వారిపై కేసులు నమోదు చేస్తామని ఇందల్వాయి ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు. శుక్రవారం ఇందల్వాయి పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్సై మనోజ్ కుమార్ మాట్లాడుతూ ఈ యేడాది జనవరి నుండి ఇప్పటివరకు 16 యాక్సిడెంట్లు అయ్యాయని, అందులో ఎనిమిది మంది హెల్మెట్ ధరించడం వల్ల చిన్నపాటి గాయాలతో బయటపడ్డారని పేర్కొన్నారు.మిగతావారు హెల్మెట్ ధరించకపోవడం వల్ల మరణించడం జరిగిందని అన్నారు. ఈనెల 15వ తారీకు నుండి తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు.మైనర్లకు ద్విచక్ర వాహనాలు తల్లిదండ్రులు ఇచ్చినట్లయితే వారి పైన కేసు నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఎక్కువ ప్రమాదాలు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించకపోవడం వలన అత్యధికంగా యాక్సిడెంట్లు అయి ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు. గ్రామాలలో నూతన విగ్రహాలు పెట్టేటప్పుడు అనుమతి తీసుకొని పెట్టాలని సూచించారు. విగ్రహాల వద్ద డిజె సౌండ్లు వాడొద్దని పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో వాహనాలు నడుపుతూ పట్టుబడితే జరిమానా విధించడం జరుగుతుందన్నరు.ఇప్పటికైనా వాహనదారులు కచ్చితంగా హెల్మెట్ ధరించి ప్రయాణం కొనసాగించాలని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.

 

Leave A Reply

Your email address will not be published.