ఘనంగా పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు

1,471

నిజామాబాద్ బతుకమ్మ అర్బన్ : నిజామాబాద్ నగరంలోని 5 వ డివిజన్ పరిధిలోని బోర్గమ్ పి గ్రామ పంచాయతీ వద్ద నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ పటేల్ హాజరయ్యారు..భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు కులచారి దినేష్ పటేల్ మాట్లాడుతూ నిజామాబాద్ పార్లమెంట్ లో ఎంతో మంది పసిపిల్లల ప్రాణాలను కాపాడుతున్న ప్రాణ దాత ధర్మపురి అరవింద్ అని అన్నారు.నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్  48 వ జన్మదినం సందర్భంగా 48 మందికి ప్రధాన మంత్రి సురక్ష యోజన భీమా చేయించిన BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదల నరేష్ ని భారతీయ జనతాపార్టీ జిల్లా అధ్యక్షులు అభినందించారు. మోడీ దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు జరుగుతున్న కార్యక్రమం టి ఎంతోమందికి ఆదర్శం అని అన్నారు అదేవిధంగా యువత భారత ప్రధాని నరేంద్ర మోడీ  సూచించిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో BJYM రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యాదాల నరేష్ ,నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పద్మారెడ్డి, BJYM జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి,నిజామాబాద్ కార్పొరేషన్ మండల అధ్యక్షులు జంగిటి ఆనంద్ కుమార్, ఇండల్వాయి మండల అధ్యక్షులు రాజన్న, bjym జిల్లా నాయకులు సతీష్ రెడ్డి,స్థానిక సీనియర్ నాయకులు తోట శాస్త్రి,శివ శంకర్,భాస్కర్,సుమో గంగాధర్,రాజేష్,రామకృష్ణ,సుదర్శన్ గౌడ్ మరియు స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.