బతుకమ్మ, నిజామాబాద్
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి ఫారెస్ట్ రేంజ్ పరిధిలో చిరుత పులి మృతి చెందింది. సంఘటన గురువారం వెలుగు చూసింది. కమ్మర్ పల్లి రిజర్వడ్ ఫారెస్టలోని ఒక ప్రైవేట్ గెస్ట్ హౌస్ సమీపంలో చిరుత పులి చనిపోయిందని పశువుల కాపరి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. చిరుత పులి రెండు రోజుల క్రితం చనిపోయి ఉంటుందని అనుమానిస్తున్నారు. గత కొన్ని రోజులుగా రిజర్వ్ అటవీ ప్రాంతంలోలోని చెరువు వద్ద రెండు కూనలతో సంచరించినట్లు పశువుల కాపరులు తెలిపారు. అటవీ శాఖ అధికారులు చిరుత మరణాన్ని గోప్యంగా ఉచినట్లు తెలిసింది. చిరుత మరణానికి వేటగాళ్ల ఉచ్చు లేదా, ఆటవి జంతువుల రక్షణకు ఉపయోగించు విద్యుత్ కంచే కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Prev Post
Next Post