బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ నగర శివారులోని ముబారక్ నగర్ లో అతుల్ కంపెనీ సంబంధించిన కొత్త టెక్నాలజీతో ఆటోలను నేషనల్ హెడ్ యోగేష్ రంజన్ ప్రారంభించారు. సుశీశ్రీ ఆటోమొబైల్స్ వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా డీలర్ సుధాకర్ రెడ్డి గత 20 సంవత్సరాలుగా అనుభవంతో ఈ రంగంలో అతుల్ కంపెనీ ప్రస్తుతం ఆయన ఆధ్వర్యంలో నడపడం చాలా సంతోషం అని అన్నారు ఒక్కో వాహనం 207 కిలోమీటర్లు చార్జింగ్ తో నడుస్తుందని ఆయన తెలిపారు, ఈ వాహనాలు 4 రకాల మోడల్స్ శుక్రవారం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ మోడల్స్ , అతుల్ రిక్, ఎనర్జీ స్క్వేర్, జెమిని ప్యాసింజర్, మొబైల్ స్క్వేర్ మోడల్స్ ఈ షోరూంలో ఫైనాన్స్ సౌకర్యంతో అందుబాటులోకి తీసుకు రావడం జరిగిందన్నారు. సెన్సార్ల నుండి స్వేచ్ఛ మరియు రేడియేషన్ లేని ఎయిర్ కూల్డ్ ఇంజన్ అతి తక్కువ అందించేందుకు సిద్ధంగా ఉన్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ ఇమ్రాన్ పాషా, సిబ్బంది సేల్స్ మేనేజర్ సంబంధిత స్టాఫ్ పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించేందుకు కృషి చేస్తామని ఆటోమొబైల్స్ డీలర్ సుధాకర్ రెడ్డి తెలిపారు.
