బతుకమ్మ, నిజామాబాద్ సిటి
ఫ్యూచర్ లైన్ పాఠశాలలో కృష్ణాష్టమివేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలోని విద్యార్థిని,విద్యార్థులు కృష్ణుని, గోపికల వేశాధారణతో ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పాఠశాల డైరెక్టర్ ప్రియాంక, స్వప్నలు మాట్లాడుతూ విద్యార్థులకు సంసృతీ, సాంప్రదాయం గురించి తెలుపుతూ ప్రతి సంవత్సరం ఈ కృష్ణాష్టమి వేడుకలను నిర్వహించడం జరుగుతుందన్నారు. అలాగే విద్యార్థులతో ఉట్టికొట్టించారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయులు లత, సుమలత, శ్రీ లత, గౌతమి, జమున పాల్గొన్నారు.