- రాత్రి పోస్టింగ్… తెల్లావారితే క్యాన్సిల్
- ఇందూర్ జిల్లాలో పోలిస్ ల పోస్టింగ్ లలో లోల్లి
- రాత్రికి రాత్రే నిలిచిపోయిన సిఐ ల ఎస్ఐల పోస్టింగ్లు
- పోలిస్ అధికారులలో అయోమయం
బతుకమ్మ, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో పోలిస్ శాఖలో జరుగుతున్న బదిలీల వ్యవహరం అధికార పార్టి నెతలకు, పోలిస్ బాస్ కు మద్యం దూరం పెంచుతోంది. గత ప్రభుత్వం హయంలో ఎమ్మెల్యేలే నియోజకవర్గాలలో సుప్రీం బాస్ ల వ్యవహరించారు. వారి నియోజకవర్గాలలో సిఐలు, ఎస్ఐ లతో పాటు చివరకు ఎసిపి స్థాయి అధికారుల నియమాకానికి ఎమ్మెల్యేల సిపారసు లెటర్లు కీలకం గా ఉండేవి. దశాబ్ధం తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నెతలకు తమకు అనుకులమైన అధికారులను నియమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు నిజామాబాద్ పోలిస్ బాస్ అదిలోనే చెక్ పెడుతున్నారు.గత ప్రభుత్వం హయంలో అనాటి ఎమ్మెల్యేల సిపారసు లెటర్ల తో నియమితులైన వారి స్థానంలో నియమితులైన వారిని తప్పించాలని తాము చెప్పిన వారికే పోస్టింగ్ ఇవ్వాలని ఐజి స్థాయిలో పోస్టింగ్ లు ఇప్పిస్తే తీరా జిల్లాకు వస్తే వారికి పోస్టింగ్ లు ఇవ్వకుండా అక్కడి నుంచి వచ్చిన ఉత్తర్వులకు విరుద్ధంగా జరుగుతున్న పోస్టింగ్ ల వ్యవహరం అధికార పార్టి నెతలకు మింగుడు పడటం లేదు. అధికార పార్టి నెతల సిఫారసుతో పోస్టింగ్ తెచ్చుకుంటే పోలిస్ బాస్ తో తంటా, పోలిస్ బాస్ ద్వార తమకు నచ్చిన చోట పోస్టింగ్ ఇప్పించుకుంటే నెతలతో వైరం అని పోలిస్ అధికారులు అయోమయం నెలకోంది. పోలిస్ కమీషనర్ ను కాదని పోస్టింగ్ తెచ్చుకున్న వారిని బాస్ ఇప్పటికి కంటినిండా కునుకు తీయనీయడం లేదని టాక్ ఉంది. ఇప్పటికి తనను కాదని నేతల ప్రాపకం తో పోస్టింగ్ లు తెచ్చుకున్న వారికి పట్ట పగలు చుక్కలు చుపుతున్నారు. అయా ఎరియాలలో చీమ చిటుకుమన్న సంబందిత పోలిస్ లను బాస్ టార్గేట్ చేస్తారని నిఘా వర్గాలను రంగంలోకి దించి విచారణ జరిపి ఎకంగా చర్యలకోసం సిఫారసు చేస్తారని పోలిస్ శాఖ అంతా కోడై కుస్తుంది. ఇటివల జిల్లాలో జరిగిన సిఐల, ఎస్ఐల బదిలీలలో కోన్ని అకస్మాత్తుగా నిలిచిపోవడంతో పోలిస్ అధికారులే షాక్ కు గురవుతున్నారు. అధికార పార్టి నేతల సిపారసులతో పోస్టింగ్ తెచ్చుకున్నవారి సంతోషం గంటల వ్యవదిలో అవిరిగా మారుతోంది. తాజాగా బుదవారం మల్టి జోన్ 1 పరిధిలో 8 మంది సిఐల బదిలీలు జరిగే అందులో నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ పరిధిలో 7 గురికి స్థాన చలనం కలిగింది. సంబందిత ఉత్తర్వులు ఐజి చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఐజి చంద్రశేఖర్ రెడ్డి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు చివరి ఎస్పీగా, నిజామాబాద్ పోలిస్ కమీషనరేట్ గా మారినప్పుడు తోలి కమీషనర్ గా పని చేశారు. అయన సిపారసుతో ఇప్పటి వరకు ఐజి వద్ధ పోస్టింగ్ కోసం వేయిటింగ్ లో ఉన్న ఓక్కరికి, నిజామాబాద్ లో లూప్ లైన్ లో ఉన్న మరోక్కరికి నిజామాబాద్ నగరంలోని రెండు సిఐ ల పోస్టింగ్ ఇస్తు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాని గత రాత్రి వాటిని నిలుపుధల చేయడం, ప్రస్తుతం ఇద్ధరు సిఐలుగా ఉన్న వారిని ఎక్కడ రిపోర్టు చేయవద్ధని మౌఖిక ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిసింది. ఎడుగురు సిఐలలో ఐదుగురు మాత్రం తమకు కేటాయించిన స్థానాలలో రిపోర్టు చేయగా ఇందూర్ నగరంకు చెందిన ఇద్ధరు ట్రాన్స్ ఫర్ ఉత్తర్వులు నిలిచిపోవడం పోలిస్ శాఖలో చర్చకు దారి తీసింది. ఇద్ధరు సిఐలకు పోస్టింగ్ కోసం అధికార పార్టికి చెందిన ఓక ప్రజా ప్రతినిధి సిఫారసుచేసిన అవినిలిచి పోవడం కలకలం రేపింది. గత నెలలో ఆర్మూర్ సిఐ పిట్ల రవికుమార్, డిచ్ పల్లి సిఐల ను బదిలీ చేస్తు వారి స్థానంలో మరో ఇద్ధరిని నియమించారు. అక్కడ కుడా అదికార పార్టి నెతల సిపారసులతో జరిగాయని వాటిని నిలిపివేయడంతో అధికార పార్టి నేతలు పోలిస్ బాస్ తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇటివల జరిగిన 40 పైకి పైగా ఎస్ఐల బదిలీలలో ఇద్ధరిని రిలివ్ చేయక పోవడంపై కుడా పోలిస్ శాఖలో చర్చ జరుగుతుంది. అందులో ఓక్కరు ఎమ్మెల్యే కు నచ్చకపోవడంతో పాటు మరో ఎస్ఐ కి మాత్రం అడ్మినిస్ర్టేషన్ గ్రౌండ్ లో రిలివ్ చేయలేదని సమాచారం. కాని పోలిస్ శాఖలో తమ సిఫారసులు చెల్లడం లేదని అధికార పార్టి నేతలు గరం గరంగా ఉన్నట్టు తెలిసింది. ప్రధానంగా ఇద్ధరు ప్రజా ప్రతినిధులు, మరోకరు ప్రభుత్వంలో కిలకంగా ఉన్న నేత తమమాట సోంత జిల్లాలో చెల్లుబాటు కావడం లేదని మండిపడుతున్నట్లు తెలిసింది. ఈ వ్యవహరంను సియం దగ్గర తెల్చుకోవాలనుకుంటున్నట్లు అనుచరులు చెబుతున్నారు.పోలిస్ అధికారుల బదిలీల వ్యవహరం ముదిరి పాకనపడింది. అయితే పోలీసు అధికారులకు పోస్టింగ్ లిపించేందుకు సిఫారసుల కోసం డబ్బులు వ్యవహారం ముడిపడి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కమీషనర్ వాటికి చెప్పి పెడుతూ సిఫారసుల ద్వారా పోస్టింగ్ అయిన వారికి పోస్టింగ్ ఇవ్వడం లేదని నడుస్తుంది. మొత్తానికి పోలీస్ బాస్ కద్దర్ లీడర్ల మధ్య సిఐలు , ఎస్ఐలు నలిగిపోతున్నారని చెప్పాలి.