బతుకమ్మ, ఇందల్వాయి : ఇందల్వాయి మండల కేంద్రంలోని చౌరస్తా వద్ద కల్వకుంట్ల కవిత తీహార్ జైలు నుండి విడుదల కావడం వల్ల బీఆర్ఎస్ నాయకులు ఆనందం వ్యక్తం చేశారు. న్యాయమే గెలిచిందంటూ సంబరాలు చేసుకున్నారు.అనంతరం సీనియర్ నాయకులు అరటి రఘు మాట్లాడుతూ కవిత పైన తప్పుడు ప్రచారాలు చేస్తూ జైల్లో పెట్టడం సరికాదని ఇప్పటికైనా న్యాయమే గెలిచిందంటూ సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఎమ్మెల్సీ కవితకు బెల్ మంజూర అయిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.