బతుకమ్మ, మోర్తాడ్: ఆగస్టు 12: దారిద్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఆకలిని తీర్చాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా ప్రతినెల ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తుంది.రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు రోజువారి కూలీ పనులు చేసుకునే కుటుంబాలతో పాటు కొన్ని మధ్యతరగతి కుటుంబాలు మాత్రమే రేషన్ బియ్యాన్ని వండుకొని తింటున్నాయి. దాదాపు 70 నుంచి 80% బియ్యాన్ని వ్యాపారులకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. దీని ఆసరాగా చేసుకొని బియ్యం వ్యాపారులు, మిల్లు వ్యాపారులు పెద్ద ఎత్తున రేషన్ కార్డ్ లబ్ధిదారుల నుంచి బియ్యాన్ని కిలో రూ. 15 నుంచి 20 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ బియ్యాన్ని అక్రమ మార్గంలో కొనుగోలు చేయడమే కాకుండా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారు.
రేషన్ బియ్యం సేకరిస్తున్న విధానం..
బడా వ్యాపారాలు గ్రామీణ ప్రాంతాల్లో రేషన్ బియ్యం కొనుగోలు చేసేందుకు కమిషన్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని వారి ద్వారా బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇందుకోసం ముందుగానే వారితో ఒప్పందం చేసుకొని వారికి రూ. వేలల్లో లక్షల్లో డబ్బులు అడ్వాన్స్ గా ఇచ్చి బియ్యాన్ని సేకరిస్తున్నారు. సేకరించిన బియ్యాన్ని వ్యాపారులు గోదం లోనికి చేర్చే వరకు అంత వారిదే బాధ్యత అన్ని ఏర్పాట్లు వారే చేసుకుంటారు రవాణాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు సంబంధిత వ్యాపారులు ఏర్పాటు చేసుకుంటారు. ఇదంతా కొన్నేళ్లుగా నిరటాకంగా కొనసాగుతున్న అక్రమంగా వ్యాపారులపై తూతూ మంత్రంగా చర్యలు తీసుకుంటున్నారు తప్ప వారిని నియంత్రించిన దాఖలాలు కనిపించడం లేదు. ప్రతినెల జిల్లా వ్యాప్తంగా 8091.849 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ప్రభుత్వం జిల్లాలోని 4,02,022 పేద కుటుంబాలకు 759 రేషన్ షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తుంది.
