బతుకమ్మ, నిజామాబాద్ సిటి : ఎస్ఎస్ఆర్ జూనియర్ ఒకేషనల్ కళాశాలలో ఇన్నోవేషన్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషనల్ యాక్టివిటీ అనే అంశంపై ఎంఎల్టి ఎంపీహెచ్డబ్ల్యూ విద్యార్థులకు సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ శ్రీశైలం మాట్లాడుతు…ప్రస్తుతం వైద్యరంగంలో శిక్షణ పొందిన వారికి అనేక అవకాశాలు కలవని అన్నారు. పారా మెడికల్ కోర్సు చదివే విద్యార్థు లు శ్రద్ధతో కోర్సును పూర్తి చేసుకొని గ్రామీణ ప్రాంతాలలో తమ సేవలను అందించాలని ఉద్యోగుల కల్పనకు తమ వంతు పూర్తి సహకారం ఉంటుందని, తన ఆస్పత్రిలో అవకాశం కల్పిస్తానని హామీ ఇచ్చారు . ముఖ్య వక్త ప్రభుత్వ మెడికల్ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం స్వాతి మాట్లాడుతూ పారామెడికల్ కోర్సుల్లో చేరిన విద్యార్థులను అభినందిస్తూ సమాజంలో పారామెడికల్ సిబ్బందికి మంచి గుర్తింపు కలదని ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్ లో శిక్షణ పొందాలని తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ఆర్ విద్యాసంస్థల అధినేత డాక్టర్ మారయ్య గౌడ్ మాట్లాడుతూ ఉపాధి లభించే కోర్సులను నూతనంగా ప్రారంభించామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. విద్యార్థినీ విద్యార్థులకు ఆఫ్ ఫ్రాన్స్ స్టడీ మెటీరియల్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు తయారుచేసిన హార్ట్ లంగ్స్, కిడ్నీ కమ్యూనిటీ హెల్త్ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ మొదలగు మోడల్స్ ను ప్రదర్శించారు. ఈ మోడల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి.
