- సీపీఐ ఎం. ఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఈ. రమేష్
బతుకమ్మ, సిరికొండ : సిరికొండ మండలం లోని అన్ని గ్రామాల్లో ఉన్న అర్హులందరికి ఇంటి స్థలంతో పాటు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సీపీఐ ఎం. ఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్.రమేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మండలంలోని పందిమడుగు గ్రామంలో సీపీఐ ఎం. ఎల్ మాస్ లైన్ మండల కమిటీ సభ్యులు కే.అశిష్ అధ్యక్షతన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు గడిచిన పది సంవత్సరాలలో బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పేదోడికి కూడా ఇల్లు నిర్మించి ఇవ్వలేదని ,పోయిన ప్రభుత్వం చేసిన తప్పిదాలను ప్రస్తుత ప్రభుత్వం చెయ్యొద్దు అని సూచించారు. పేదోడి సొంత ఇంటి కల నెరవెర్చేల ప్రభుత్వం దృష్టి సారించాలని, ప్రభుత్వాలు ఎన్ని మారిన పేదల బతుకులు మారలేదు అన్నారు. పేదలు ఇంకా ఇల్లు లేకుండా పూరి గుడిసెల్లో నివాసం ఉండాల్సిన దుస్థితి నెలకొన్నది అన్నారు. ఎన్నికల్లో ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం స్థలం లేని వారికి సొంత స్థలం ఇచ్చి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా పందిమడుగు, చీమన్ పల్లి తదితర గ్రామాల్లో అనేక ఏళ్లుగా పోడుగోట్టుకొని సాగుచేసుకుంటున్న పేదలకు భూమి పట్టాలు ఇవ్వడంలో ప్రభుత్వం నాన్చేధోరణిని వదిలి పట్టాలు ఇచ్చి సమస్యను పరిష్కారం చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ ఎం. ఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు ఆర్.దామోదర్,జి. సాయరెడ్డి, , సిరికొండ మండల కమిటీ సభ్యులు ఈ.రమేష్, పందిమడుగు గ్రామ నాయకులు ప్రభాకర్, ఎల్లన్న, కనకన్నా, సాగర్, అనుస్ తదితరులు పాల్గొన్నారు.