రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలోని బస్టాండ్ ప్రాంగణంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు మాట్లాడుతూ.. బడుగు బలహీన వర్గాల నాయకుడు సర్దార్ సర్వాయి పాపన్న అని కొనియాడారు. అదేవిధంగా పోరాట స్ఫూర్తితో – బహుజనులు ఐక్యం అయి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గౌడ కులస్తులు విఠల్ గౌడ్, సుదర్శన్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.