బతుకమ్మ, జక్రాన్ పల్లి : జాక్రాన్ పల్లి మండలం పడకల్ గ్రామంలో వృద్ధాప్య వైద్య శిబిరం మంగళవారం నిర్వహించినట్లు ఆయుష్ జిల్లా ఇన్చార్జి డా. నారాయణ తెలిపారు. ఈ శిబిరంలో దీర్ఘకాలిక వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశమన్నారు. పడకల్ ఆయుర్వేద వైద్యాధికారి డా.లలిత మాట్లాడుతూ వృద్ధాప్య వైద్య శిబిరాలను మండలం లోని ప్రజలు అందరు వినియోగించు కోవాలన్నారు. ఆయుర్వేద మందులతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అన్నారు. ఈ కార్యక్రమంలో డిపిఏం వందన రెడ్డి, ఆయుష్ ఫార్మసిస్టులు పురుషోత్తం, గౌతం రాజు, సిబ్బంది మహేందర్, ప్రజలు పాల్గొన్నారు.
