బతుకమ్మ భిక్కనూరు: గణేష్ నవరాత్రి ఉత్సవాలు శాంతియుతంగా జరుపుకోవాలని భిక్కనూరు ఎస్సై రామ్ చందర్ నాయక్ అన్నారు. మండలంలోని సిద్ధరామేశ్వర నగర్ గ్రామంలో శనివారం పోలీసు గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై మాట్లాడుతూ గణేష్ ఉత్సవాలు నిర్వహించే స్థలంలో డీజే సౌండ్ కు పోలీస్ స్టేషన్ అనుమతి తీసుకోవాలని అన్నారు.ఈ సమావేశంలో హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది, గణేష్ మండపాల సభ్యులు, వీడిసి సభ్యులు పాల్గొన్నారు.