బతుకమ్మ, మోర్తాడ్ : బాల్కొండ నియోజకవర్గం మండల కేంద్రమైన మోర్తాడ్ సి.హెచ్. సి ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తిస్థాయి లో వైద్యులను నియమించి ప్రభుత్వ ఆసుపత్రిలోనే గతంలో మాదిరిగా ప్రసవాలు జరిగేలా, 24, గంటలు రోగులకువైద్య సేవలు అందించేలా ప్రభుత్వం గానీ, జిల్లా కలెక్టర్ గాని ప్రత్యేక చొరవ తీసుకొని ప్రసవాలు నిర్వహించే వైద్యురాలిని, మత్తు వైద్యులను నియమించాలని ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షులు ఉమేష్ కోరారు. సోమవారం రోజున ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో నాయకులు మోర్తాడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి, వైద్య చికిత్స అందించే వైద్యుల గదులను, గర్భిణీ స్త్రీలు వస్తే చికిత్సలు చేసే గదులను, రక్త పరీక్ష నిర్వహించే గదులను, ఓ.పి. చూసే ప్రాంతాలను, ఆస్పత్రి ఆవరణ ను ధర్మ సమాజ పార్టీ నాయకులు పరిశీలించారు. అంతేకాకుండా రోగులను కలిసి ఆస్పత్రిలో రోగులకు చికిత్సలు ఎలా చేస్తున్నారని, జ్వరాలకు గురైన వారిని సైతం చికిత్సలు ఎలా అందిస్తున్నారని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు అడిగి కాంట్రాక్ట్ పద్ధతిలో రోగులకు భోజనం సరిగా అందించడం లేదని, వెంటనే కాంట్రాక్టు పద్ధతిలో రోగులకు భోజనం అందించే విధానాన్ని రద్దుచేసి, ఆస్పత్రిలోనే ఒక గదిలో వంట చేసే మనిషిని పెట్టి సరియైన పౌష్టికాహారం రోగులకు అందించాలని ధర్మ సమాజ్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ ను, జిల్లా సూపర్డెంట్ ను పత్రిక ముఖంగా కోరారు. ధర్మ సమాజ్ నాయకులు ఆస్పత్రి సందర్శనకు వెళ్లిన సమయంలో ఏ ఒక్క డాక్టర్ లేకపోవడం, సిబ్బంది భోజనానికి డాక్టర్లు వెళ్లారని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తుందని వారు ఆరోపించారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నంత అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఎంతో విశాలమైన ప్రశాంతానికి నిలయంగా ఉన్న మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రి లో అన్ని సౌకర్యాలు కల్పించి, వైద్యులను నియమించి, ప్రసవాలు మోర్తాడ్ ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరిగేలా చర్యలు చేపట్టి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధికి కృషి చేయాలని ధర్మ సమాజ్ నాయకులు కోరారు.